Maldives | లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవులతో ఇక్కడి పర్యాటకరంగాన్ని పోలుస్తున్నారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులతో పాటు పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ అభ్యంతరక వ్యాఖ్యలపై సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘బాయ్కాట్ మాల్దీవులు’ ట్రెండింగ్ మారింది.
ఇదిలా ఉండగా.. మాల్దీవుల విదేశాంగ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ సైతం ఆ దేశ మంత్రులు, నాయకులు చేసిన వ్యాఖ్యలను మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులు, ఓ నాయకుడు ప్రధాని మోదీకి, భారత ప్రజలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఖండించదగ్గవని.. అసహ్యకరంగా ఉన్నాయని అబ్దుల్లా ట్వీట్ చేశారు. ప్రజాప్రతినిధులు విధి నిర్వహణలో ఉండాలని.. భారత్ తిరుగులేని మిత్రదేశమన్నారు. చారిత్రాత్మకంగా అవసరమైన సమయంలో మొదట స్పందించారన్నారు.
సన్నిహిత సంబంధాలు, పరస్పర గౌరవం, చరిత్ర, సంస్కృతితో సంబంధాలు ముడిపడి ఉన్నాయన్నారు. విదేశీ వ్యవహారాల నిపుణుడు రాబిందర్ సచ్దేవ్ స్పందిస్తూ భారత్ వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిందేనన్నారు. భారత్ పర్యాటకం ద్వారా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తుందన్నారు. 1988లో మాల్దీవుల్లో తిరుగుబాటు జరిగే భారత్ తన బలగాలను పంపి.. కొన్ని గంటల్లోనే అడ్డుకుందన్నారు. పొరుగున ఉన్న భారతదేశం మాల్దీవుల జాతీయ భద్రతకు సైన్యాన్ని, నీటి కొరత ఉన్న సమయంలో విమానాల్లో వాటర్ బాటిల్స్ను పంపిందని గుర్తు చేశారు.