Maldives | ముంబై, జనవరి 7: భారత్పైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేశాయి. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు సామాజిక మాధ్యమాల్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. బాలీవుడ్ నటులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు, నెటిజనులు కూడా సోషల్మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవులను బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేశారు. మాల్దీవుల ప్రతిపక్షాలు కూడా ఆ దేశ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు డిప్యూటీ మంత్రులపై సస్పెన్షన్ వేటు వేసింది.
ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. అక్కడి సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు.. తమ లిస్టులో లక్షద్వీప్ను చేర్చుకోవాలని సూచిస్తూ ఫొటోలను షేర్ చేశారు. ఈ పోస్ట్పై మాల్దీవుల మంత్రులు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని ఇజ్రాయెల్ పప్పెట్గా అభివర్ణిస్తూ ఓ మంత్రి దుర్భాషలు చేశారు. భారత్ను ఆవు పేడతో పోల్చారు. మరో ఇద్దరు మంత్రులు కూడా ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగింది.
మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ, రాజకీయ, క్రీడాప్రముఖులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై భారతీయులు లక్షద్వీప్కే వెళ్లాలని, పర్యాటకంగా మాల్దీవులని బాయ్కాట్ చేయాలని కోరారు. భారత్లోని తీరప్రాంతాలు, దీవుల్లోని అందమైన బీచ్లకు సందర్శించండి.. అంటూ తమ అభిమానులను బాలీవుడ్ సినీ నటులు సల్మాన్ఖాన్, అక్షయ్కుమార్, టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, వెటరన్ క్రీడాకారుడు వెంకటేశ్ ప్రసాద్ కోరారు. తన 50వ పుట్టినరోజును కొంకణ్ తీరంలో జరుపుకున్నానని సచిన్ టెండుల్కర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
మాయిజ్జు ప్రభుత్వ తీరుపై మాల్దీవులు ప్రతిపక్ష పార్టీ నాయకులు మండిపడ్డారు. భారత్పై విద్వేష వ్యాఖ్యలు చేయటాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షులు ఇబ్రహీం సోలీ, మహ్మద్ నషీద్లు ఖండించారు. ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. దీంతో ఆదివారం మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. భారత్, ప్రధాని మోదీపై తమ మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నది. సోషల్మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు మాల్షా షరీఫ్, మరియం షువానా, అబ్దుల్లా మాజిద్, ప్రభుత్వ అధికారుల్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
చైనాతో స్నేహం కోరుకుంటున్న మ హ్మద్ మాయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడయ్యాక భారత్-మాల్దీవులు సం బంధాలు దెబ్బతిన్నా యి. భారత్తో చేసుకున్న రక్షణ సహా పలు ఒప్పందాల్ని రద్దు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మాల్దీవుల్లోని భారత సైనిక బలగాల్ని ఉపసంహరించుకునేందుకు చర్యలు చేపట్టారు. భారత్కు వ్యతిరేకంగా.. చైనాకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అధ్యక్షుడు మాయిజ్జు తొలి విదేశీ పర్యటన సోమవారం చైనాలో మొదలుకానున్నది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కలుసుకోబోతున్నారు. ఇదే సమయంలో భారత్ పట్ల మాల్దీవులు మం త్రులు అనుచిత వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పర్యాటకంగా ఎంతో ఆదాయాన్ని సమకూర్చుతున్న భారత్పై మాల్దీవులు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు భారతీయుల్ని ఆగ్రహానికి గురిచేశాయి.