India Corona | దేశంలో మరోసారి 500కి పైనే కొత్త కేసులు (India Corona Virus) నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 1,23,395 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 535 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,88,426కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 6,168 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,50,404 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో కొవిడ్ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,854కి ఎగబాకింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.01 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,02,872) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
Also Read..
Kerala State Lotteri | కేరళ లాటరీ డ్రా.. రూ.12 కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి
Cannes 2023 | కేన్స్లో సన్నీ, అదితి, శృతి మెరుపులు.. ఫొటోలు వైరల్
Manipur Violence | అల్లర్లతో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు.. రూ.1800 చేరిన వంట గ్యాస్