Covid-19 | దేశంలో కొత్తగా 114 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసల సంఖ్య 870కి చేరిందని ఆరోగ్య కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ కారణంగా మహారాష్ట్రలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 5 నాటికి రోజువారీ కొవిడ్ కేసల సంఖ్య రెండంకెలకు పడిపోగా.. మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్, శీతల వాతావరణ పరిస్థిల నేపథ్యంలో కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికే భారత్లో మూడు కొవిడ్ వేవ్లను ఎదుర్కొన్నది.
ఏప్రిల్-జూన్ 2021లో డెల్టా వేవ్ సమయంలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. 7 మే 2021న గరిష్ఠంగా 4,14,188 కొత్త కేసులతో పాటు 3,915 మరణాలు రికార్డయ్యాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 4.5 కోట్ల మందికిపైగా జనం కొవిడ్ బారినపడ్డారు. వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 5.3 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. వైరస్ నుంచి 4.4కోట్ల మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్ల కొవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.