India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా నిన్నటితో పోలిస్తే నేడు 30 శాతం మేర కొవిడ్ కేసులు పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 8 వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కాగా.. నేడు ఆ సంఖ్య 10 వేలు దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Union Health Ministry) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 2,29,958 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,158 కొత్త కేసులు బయటపడ్డాయి.
ప్రస్తుతం దేశంలో 44,998 కేసులు యాక్టివ్ (Active Cases)గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,10,127 మంది కోలుకున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 19 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,035కి ఎగబాకింది.
ఇక రోజూవారి పాజిటివిటీ రేటు ఏకంగా 4.42 శాతానికి పెరిగింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.10 శాతం యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.71 శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,24,653) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read..
Ritu Shah | నా కలల రచన.. తెలంగాణ కళ
Short circuit | బంజారాహిల్స్లో విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు అన్నదమ్ములు మృతి
Mission Vatsalya | అభాగ్యులకు భరోసా ‘మిషన్ వాత్సల్య’.. 6 నుంచి 18 ఏండ్లలోపు అనాథలకు ఆర్థిక చేయూత