న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 24 గంటల వ్యవధిలోనే 6,050 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 203 రోజుల్లో ఇదే గరిష్టం. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 34.47 కోట్లు, మరణాలు 5,30,943. దేశంలో క్రియాశీల కేసులు 28,303 ఉన్నాయి. గత 24 గంటల్లో 14 మరణాలు నమోదయ్యాయి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అన్ని రాష్ర్టాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించారు. టెస్టులు, వ్యాక్సినేషన్ పెంచాలని సూచించారు. 10,11 తేదీల్లో కొవిడ్ దవాఖానల్లో మాక్డ్రిల్స్ నిర్వహించాలని కోరారు. కరోనా నేపథ్యంలో పుదుచ్చేరిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.