Coronavirus | దేశంలో కరోనా (Coronavirus) మహమ్మారి చాపకింద నీరులా పాకుతోంది. రోజూ వారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 800కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 798 కొత్త కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో కలిసి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఐదు మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కొత్త వేరియంట్ జేఎన్.1 కారణమని తెలుస్తోంది.
Also Read..
Donald Trump | ట్రంప్కు మరో షాక్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించిన మరో రాష్ట్రం
Shots fired | కెనడాలో హిందూ వ్యాపారి ఇంటిపై కాల్పుల మోత
Storm Gerrit | బ్రిటన్ను వణికిస్తున్న గెరిట్ తుఫాను.. ల్యాండింగ్ సమయంలో కుదుపులకు లోనైన విమానం