న్యూఢిల్లీ: మణిపూర్లో ప్రభుత్వాన్ని మార్చాలని, అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించేందుకు శాంతి చర్చలు చేపట్టాలని, ప్రధాని మోదీపై దేశం విశ్వాసాన్ని కోల్పోయిందని ఏఐటీసీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని మతపరమైన అంశంగా మారుస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళా రెజ్లర్లతో అనుచితంగా వ్యవహరించిన బ్రిజ్ భూషణ్పై కేంద్రం చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ గురించి ఎటువంటి కామెంట్ చేయకపోవడం దారుణమన్నారు. మణిపూర్ హింసపై అక్కడ 6500 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, 4వేల ఇండ్లు దగ్ధమయ్యాయని, సుమారు 60 వేల మంది నిరాశ్రయులైనట్లు ఎంపీ ఆరోపించారు.
#WATCH | TMC MP Mahua Moitra says "India has lost confidence in you (PM Modi). The spectacle of the prime minister of the greatest democracy bowing to religious Seers of a majority in the chamber of the new Parliament fills us with shame, police manhandling and filing FIRs… pic.twitter.com/BBFMVIqExC
— ANI (@ANI) August 10, 2023