భారత్ గత ఏడాదికాలంగా రష్యా నుంచి చవకగా ముడి చమురును కొంటున్న సంగతి తెలిసిందే. ఎంత తక్కువకు కొంటున్నారన్నది మాత్రం మోదీ సర్కార్ బయటపెట్టడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బ్యారెల్ ముడిచమురును సుమారు 30 డాలర్లు (అంతర్జాతీయ మార్కెట్ ధరకన్నా) తగ్గించి కొంటున్నట్టు తెలిసింది.
ఫిబ్రవరి, 2022 నుంచి ముడిచమురు ధరలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు బ్యారెల్ ముడిచమురు 75 డాలర్లకు చేరుకుంది. అయినా దేశీయంగా ఇంధన ధరలు మాత్రం తగ్గటం లేదు. భారీగా పన్నులు వసూళ్లు చేస్తూ ఖజానాను నింపుకోవాలన్న ఆరాటమే తప్ప, సామాన్యుడికి ఊరట కలిగించే ఉద్దేశం మోదీ సర్కార్లో కనపడటం లేదు.