పాట్నా: బీహార్లో ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్ మధ్య లోక్సభ ఎన్నికల పోటీకి సంబంధించి సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. (seat sharing deal) మొత్తం 40 సీట్లకుగాను పూర్నియా, హాజీపూర్తో సహా 26 స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది. కిషన్గంజ్, పాట్నా సాహిబ్ సహా తొమ్మిది స్థానాలు కాంగ్రెస్కు కేటాయించింది. వామపక్షాలు ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే ఆర్జేడీ ఏకపక్షంగా సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కతిహార్, పూర్నియా సీట్లు తమకు కావాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
కాగా, మంగళవారం పర్నాలో కాంగ్రెస్ నాయకుడు ముకుల్ వాస్నిక్ నివాసంలో జరిగిన ‘ఇండియా’ బ్లాక్ మీటింగ్కు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హాజరయ్యారు. బీహార్లో సీట్ల షేరింగ్ ఫార్ములాపై చర్చించారు. సీట్ల ఖరారుపై భాగస్వామ్య పార్టీల మధ్య మౌఖికంగా ఒప్పందం కుదిరిందని తేజస్వి యాదవ్ తెలిపారు. అన్ని పార్టీలకు గౌరవప్రదమైన సీట్లు లభిస్తాయని అన్నారు.