బెంగళూరు: ఉచితాలకు తాము వ్యతిరేకమంటూ గప్పాలు కొట్టే బీజేపీ.. కర్ణాటకలో మాత్రం ఉచిత హామీలు గుప్పించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి బీజేపీ సర్కారు బడ్జెట్లో ప్రజలకు తాయిలాలు ప్రకటించింది. భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.500 అందజేస్తామని తెలిపింది. అలాగే మహిళలు, బాలికలకు ఉచిత బస్ పాస్లు జారీచేస్తామని పేర్కొన్నది. రైతులకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది.