తిరువనంతపురం: సీఎం ప్రయాణించిన విమానంలో ప్రయాణికుల మాదిరిగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణించారు. విమానం ల్యాండ్ కాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని కేరళలోని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి.
కాగా, సీఎం విజయన్ సోమవారం కన్నూర్ నుంచి తిరువనంతపురానికి విమానంలో ప్రయాణించారు. ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బ్లాక్ డ్రెస్ ధరించి ప్రయాణికుల మాదిరిగా అదే విమానంలో ప్రయాణించారు. ఆ విమానం తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే కాంగ్రెస్ కార్యర్తలు ఒక్కసారిగా తమ సీట్ల నుంచి పైకి లేచి సీఎం విజయన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే సీఎం వెంట ఉన్న సిబ్బంది, ఆయన పార్టీ నేత వెంటనే జోక్యం చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలను వెనక్కి నెట్టారు.
మరోవైపు కేరళ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ శబరినాథన్ దీనికి సంబంధించిన ఫొటో, వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిరసన తెలుపుతున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సీపీఐ(ఎం) సీనియర్ నేత, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ తోసివేశారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు విమానంలో ఉన్న సీఎంపై దాడికి ప్రయత్నించారని వామపక్ష నేతలు ఆరోపించారు.
కాగా, ఈ సంఘటన అనంతరం తిరువనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై అధికార సీపీఎం కార్యకర్తలు దాడులు చేశారు. కార్యాలయంలోని చైర్లు, బోర్డులు, ఫర్నీచర్, వాహనాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ కార్యాలయంపై రాళ్లు కూడా రువ్వారు.
Passengers inside an aeroplane protest against Pinarayi Vijayan, asking him to resign. This peculiar mode of protest is likely the first of its kind India has seen. Judging by the fury of the public, it's better the corrupt CM resigns now.#GoldSmugglingCase #PinarayiVijayan pic.twitter.com/3qvz7UTYNY
— Pratheesh Viswanath (@pratheesh_Hind) June 13, 2022