కొత్తగూడెం ప్రగతి మైదాన్: భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యుడు మృతిచెందాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. మృతిచెందిన మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు ఉధమ్ సింగ్గా పోలీసులు గుర్తించారు.
మృతుడిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నదని, ఉధమ్ కీలక మావోయిస్టు ఆపరేషన్స్లో తనవంతు పాత్ర పోషించాడని పోలీస్ అధికారులు వెల్లడించారు.