రిపబ్లిక్ వేడుకల్లో పంజాబ్రాష్ట్రానికి చెందిన శకటానికి స్థానం కల్పించకపోవడంపై మోదీ ప్రభుత్వంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మండిపడ్డారు. ఇది కేంద్ర హ్రస్వ దృష్టికి నిదర్శనమని విమర్శించారు.
తన దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముకం చేసేందుకు స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో యువకులు తమ ప్రాణాలను అర్పించారు. అటువంటి వారిలో ఒకరు విప్లవకారుడు ఉధమ్ సింగ్...