చండీగఢ్: రిపబ్లిక్ వేడుకల్లో పంజాబ్రాష్ట్రానికి చెందిన శకటానికి స్థానం కల్పించకపోవడంపై మోదీ ప్రభుత్వంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మండిపడ్డారు. ఇది కేంద్ర హ్రస్వ దృష్టికి నిదర్శనమని విమర్శించారు. పంజాబ్పై ఇలాంటి వివక్ష తగదన్నారు. అసలు పంజాబ్కు ప్రాతినిధ్యం ఇవ్వకుండా దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలు జరపడమన్నది ఊహకే అందడం లేదని విమర్శించారు. ఇది కేంద్రం కావాలని చేసిన పనేనని ఆయన ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాటంలో పంజాబీల ప్రాతినిధ్యం 90 శాతం ఉందని, భగత్సింగ్, ఉద్ధమ్సింగ్, లాలా లజపతిరాయ్, కర్తార్ సింగ్ సహా వేలాదిమంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, వందలాది మంది ప్రాణత్యాగం చేశారని, అంత ఘన చరిత్రగల రాష్ట్రాన్ని ఉద్దేశపూర్వకంగానే వేడుకల నుంచి తొలగించారని సీఎం భగవంత్ మన్ విమర్శించారు.