న్యూఢిల్లీ : ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో ఆసక్తికర వీడియోను (Viral Video) పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డు పక్కన ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్ వైపు ఏనుగు దూసుకురావడం కనిపిస్తుంది. ఏనుగు ప్రశాంతంఆ అక్కడి నుంచి వెళ్లే వరకూ బస్ వేచిఉండటం ఈ వైరల్ క్లిప్లో చూడొచ్చు. దూరం నుంచే బస్ను గమనించిన ఏనుగు వాహనం వైపు వచ్చింది.
అయితే ఏనుగు బస్కు లేదా ప్రయాణీకులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బస్లో ఏం జరుగుతుందన్నది పరిశీలిస్తూ ఏనుగు తన దారిన తాను వెళ్లిపోయింది. ఏనుగు వెళుతుండగా బస్ డ్రైవర్తో పాటు ప్రయాణీకులు మౌనంగా ఉంటూ దాన్ని ప్రశాంతంగా వెళ్లనిచ్చారు.
When the tusker decided to check out passengers in the bus, everyone led by the bus driver displayed nerves of steel, a great sense of calm and understanding and everything went off well. Video – in Karnataka. Shared by a friend. #coexistence #peopleforelephants pic.twitter.com/OJG4uPRvoi
— Supriya Sahu IAS (@supriyasahuias) July 24, 2023
సృష్టిలో సమస్త జీవరాసులు సంయమనంతో సహ జీవనం చేస్తాయనేందుకు ఇంతకన్నా మంచి ఉదాహరణ మరొకటి ఉండదు..బస్లో ప్రయాణీకులను చెక్ చేస్తూ ఏనుగు ముందుకు సాగుతుండగా బస్ డ్రైవర్ సహా ప్రయాణీకులందరూ కామ్గా ఉంటూ పరిస్ధితిని అర్ధం చేసుకుని ప్రవర్తించడంతో అంతా సాఫీగా సాగిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కర్నాటకలో జరిగిన ఈ ఘటనను ఫ్రెండ్ షేర్ చేశారని రాసుకొచ్చారు. మనం ఏ జీవరాసినీ డిస్ట్రబ్ చేయకుంటే అవి కూడా మనల్ని డిస్ట్రబ్ చేయవని ఓ యూజర్ రాసుకొచ్చారు.
Read More :