Sudha Murty | ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (Infosys Co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధామూర్తి (Sudha Murty ) అందరికీ సుపరిచితులే. విద్యావేత్త, రచయిత, అంతకుమించి గొప్ప మానవతామూర్తిగా పేరు పొందారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ (Infosys Foundation chairperson) గా కొనసాగుతున్నారు. కాగా, తాజాగా సుధామూర్తి.. ఓ నటి కారణంగా కన్నీరు పెట్టుకున్నారట. ఈ విషయాన్ని సుధామూర్తి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకీ ఆ నటి ఎవరనుకుంటున్నారు..? బాలీవుడ్ స్టార్ అలియా భట్ (Alia Bhatt). అలియా కారణంగా సుధామూర్తి ఎందుకు కన్నీరు పెట్టుకున్నారంటే..?
స్పై థ్రిల్లర్ నేపథ్యం లో ‘రాజీ’ (Raazi) చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. 2018లో విడుదలైన ఈ చిత్రంలో అలియా మనదేశం కోసం పనిచేసే గూఢచారి పాత్రలో ఒదిగిపోయింది. కాగా, ఈ చిత్రాన్ని చూసిన సుధామూర్తి.. అలియా నటనకు ఏడ్చేసినట్లు చెప్పారు. ‘భావోద్వేగభరిత సన్నివేశాలు చూసి నేనెప్పుడూ కంటతడి పెట్టుకోలేదు. కానీ, ‘రాజీ’ చిత్రంలో అలియా నటనకు మాత్రం ఏడ్చేశాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘నేను థియేటర్ లో 1958లో తొలిసారి సినిమా చూశాను. అప్పటి నుంచి వైజయంతీమాలను అభిమానించడం ప్రారంభించా. దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, హృతిక్ రోషన్ నుంచి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వరకూ వివిధ దశల్లో వారి చిత్రాలను ఆస్వాదించాను. ఆయుష్మాన్ ఖురానా కూడా ఇష్టమే. నర్గిస్ నటననూ ఇష్టపడతా. ఈ తరంలో మాత్రం అలియా నటనను అభిమానిస్తా. నిజంగా తాను ఓ గొప్ప యాక్టర్’ అంటూ సుధామూర్తి పేర్కొన్నారు. ఇక సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, సంగీతం గురించి తమ ఇంట్లో చర్చించుకుంటుంటామని సుధా మూర్తి ఈ సందర్భంగా తెలిపారు.
ఇక 2018 లో విడుదలైన ‘రాజీ’ సినిమా.. ఏకంగా రూ.190 కోట్లు వసూలు చేసింది. అంతేకాకుండా 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. అందులో ఉత్తమ నటి పురస్కారం ఒకటి. ఇక అలియా నటించిన తాజా చిత్రం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rakhi Aur Rani Ki Prem Kahani). ఈ సినిమా ఈనెల 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు.
Also Read..
Samantha | వెకేషన్ లో సామ్.. కొత్త లుక్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూ..
Indonesia | ఘోర పడవ ప్రమాదం.. 15 మంది మృతి.. 19 మంది గల్లంతు
Marathon | మారథాన్ పరుగులో పాల్గొని.. గుండెపోటుతో 20 ఏళ్ల యువకుడి మృతి