ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అంబులెన్స్ను ఢీ కొనడంతో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 13 మంది గాయపడ్డారు. ముంబైలోని బాంద్రా-వొర్లి సీ లింక్పై ఈ ఘటన జరిగింది. బ్రిడ్జిపైన 76, 78 పోల్ నెంబర్ల వద్ద బుధవారం తెల్లవారుజామున దుర్ఘటన చోటుచేసుకుంది.
ఘటన సమాచారం తెలిసిన వెంటనే ప్రమాద స్ధలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. స్ధానికుల సహకారంతో క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనతో బాంద్రా నుంచి వొర్లికి వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు.