Arvind Kejriwal | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పలు పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడటం బీజేపీని కలవరానికి గురి చేస్తోందని అంటున్నారు. తాజాగా ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు.
విపక్ష కూటమి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంతో బీజేపీ ఆందోళన చెందుతోందని అన్నారు. ఇప్పుడు అదే కూటమి ‘భారత్’ అని పేరు పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా..? అని పశ్నించారు. ‘ఇలా దేశం పేరు మార్పుపై అధికారిక సమాచారం ఏమీ లేదు. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడటం వల్లే ఇలా జరుగుతోంది. ఒకవేళ ఇండియా కూటమి తన పేరును భారత్గా మార్చుకుంటే అప్పుడు భారత్ పేరును బీజేపీ అని మార్చేస్తారా..? ఈ దేశం ఒక్క పార్టీదే కాదు. 140 కోట్ల మంది ప్రజలది’ అని కేజ్రీవాల్ అన్నారు.
Also Read..
Sharad Pawar | దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు : శరద్ పవార్
Amitabh Bachchan | భారత్గా మారనున్న ఇండియా..! ఆసక్తికర ట్వీట్ చేసిన బిగ్బీ
Bharat | భారత్గా మారనున్న ఇండియా : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానానికి కసరత్తు