Amitabh Bachchan | కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును (renaming India) భారత్గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘భారత్ మాతా కీ జై’ (Bharat Mata ki jai) అంటూ దేశ త్రివర్ణ పతాక ఎమోజీని ట్విట్టర్లో (ఎక్స్) పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
బిగ్ బీ ట్వీట్తో ఇండియా పేరు మార్పు ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం ఇండియా పేరు మార్పుకు సంబంధించి దేశంలోని పలువురు ప్రముఖులకు ఇప్పటికే సమాచారం ఇచ్చిందంటూ చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే బిగ్బీ ఇలా ట్వీట్ పెట్టినట్లు భావిస్తున్నారు.
రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్ (Bharat)గా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని.. ఇండియా పేరు మార్చుతూ సభలో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ సర్కార్ పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ నుంచి జీ20 ప్రతినిధులకు అధికారిక సమాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటం పేరు మార్పు ప్రతిపాదనకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ లేఖను ట్వీట్ చేస్తూ ఈ వార్త నిజం కావచ్చని రాసుకొచ్చారు.
జీ20 డిన్నర్కు సంబంధించి రాష్ట్రపతి ప్రతినిధులకు పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రస్తావించారు. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరించడం కొనసాగిస్తున్నారని, ఇండియాను విభజిస్తున్నారని మరో ట్వీట్లో జైరాం రమేష్ మండిపడ్డారు.
T 4759 – 🇮🇳 भारत माता की जय 🚩
— Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023
Also Read..
Bharat | భారత్గా మారనున్న ఇండియా : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానానికి కసరత్తు
President of Bharat: ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. జీ20 ఇన్విటేషన్పై వివాదం
Kedarnath Pilgrim | సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడిపోయిన యువకుడు.. ఎలా రక్షించారో చూడండి.. Video