Anand Mahindra | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). వినోదాత్మక వీడియోలతో పాటు ఆలోచన రేకెత్తించే పోస్ట్లు తరచూ షేర్ చేస్తుంటారు. కొత్త ప్రదేశాలు, సరికొత్త విషయాలను ఆయన సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా ఆవిష్కరిస్తుంటారు. తన దృష్టికి వచ్చిన వీడియోలను కూడా ఫాలోవర్స్తో పంచుకుంటూ ఉంటారు. అలా నెట్టింట వైరలవుతున్న ఓ వీడియో ఇప్పుడు ఆనంద్ మహీంద్రాకు బాధను కలిగించింది.
ఆ వీడియోలో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా (Gateway of India in Mumbai) సమీపంలో కొందరు సముద్రం (Sea)లో చెత్తను డంప్ చేస్తున్నట్లు (Garbage Dumping ) కనిపిస్తుంది. ట్యాక్సీలో కొన్ని సంచుల్లో చెత్తను తెచ్చి సముద్రంలో పారబోసి వెళ్లిపోతారు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘ఇది చూస్తుంటే చాలా బాధగా ఉంది. మనుషులు తమ పద్ధతి మార్చుకోకపోతే మౌలిక సదుపాయాలు ఎంత మెరుగుపడినా నగర జీవితంలో నాణ్యత కనిపించదు’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ను గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు.
దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ముంబై పోలీసులు ఘటనపై స్పందించారు. సముద్రంలో చెత్త పారబోసిన వ్యక్తుల కోసం వెతుకులాట ప్రారంభించారు. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర కనిపించిన ట్యాక్సీని ట్రాక్ చేసి చెత్తను డంప్ చేసిన వ్యక్తుల్ని గుర్తించారు. ఈ మేరకు వారికి రూ.10,000 భారీ జరిమానా విధించారు. మరోవైపు ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సదరు వ్యక్తులు చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
It hurts just to see this. No amount of improvement in physical infrastructure can improve the city’s quality of life if the civic attitude isn’t transformed. @IqbalSinghChah2 @MumbaiPolice https://t.co/Efh0ssHQ3f
— anand mahindra (@anandmahindra) November 21, 2023
Also Read..
Akhilesh Yadav | అలాజరిగుంటే టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచేది : అఖిలేశ్ యాదవ్
Heavy Rains | కేరళ, తమిళనాడుకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ