న్యూఢిల్లీ: ఇండ్లు, కార్యాలయాల్లో రోజుకు 9 -10 గంటలపాటు కూర్చునేవారికి స్థూలకాయం, గుండెజబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజుకు 8 గంటలపాటు కూర్చునేవారి కన్నా రోజుకు 12 గంటలపాటు కూర్చునేవారు మరణించే అవకాశం 38% ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.
రోజుకు 22 నిమిషాల కన్నా తక్కువసేపు వ్యాయామం చేసేవారిలో ఈ ముప్పు కనిపించింది. 50 ఏళ్లకుపైబడిన వయసుగల వారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఒకేసారి 22 నిమిషాలపాటు వ్యాయామం చేయలేనివారు అప్పుడప్పుడూ కొంత సేపు చేసినా సత్ఫలితాలు కనిపించాయి. అంటే రోజుకు కనీసం 22నిమిషాలు వ్యాయామం చేస్తే మరణించే అవకాశాలు తగ్గుతాయన్నమాట.