అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలో పట్టుబడిన పాకిస్తాన్ పడవలో రూ 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఫిషింగ్ బోట్లో ఉన్న ఏడుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్వాడ్తో కలిసి ఆదివారం రాత్రి పాకిస్తాన్ బోట్ అల్ హుసేనిని అడ్డుకుంది.
ఈ పడవలో ప్రయాణిస్తున్న 77 కిలోల హెరాయిన్ తరలిస్తూ ఏడుగురిని అరెస్ట్ చేసింది. పెద్దమొత్తంలో డ్రగ్స్తో భారత జలల్లోకి ప్రవేశించిన బోట్ను అధికారులు సీజ్ చేశారు. గత నాలుగేండ్లుగా భారత జలాల మీదుగా గమ్యస్ధానాలకు నార్కోటిక్స్ను పాకిస్తాన్ స్మగ్లర్లు చేరవేస్తున్నారని ఎప్పటికప్పుడు వీరి ఆగడాలను తిప్పికొడుతున్నామని డిఫెన్స్ ప్రజాసంబంధాల అధికారి (గుజరాత్) వెల్లడించారు.
అక్రమ డ్రగ్స్ సరఫరా కోసం కరాచీ పోర్టు నుంచి బయలుదేరిన పాకిస్తాన్ పడవ వీహెచ్ఎఫ్ రేడియో ఛానెల్ వాడుతూ కాంటాక్టులను ఏర్పరచుకుందని, వీటికోసం కోడ్ పదాలను ఉపయోగిస్తున్నదని గుజరాత్ ఏటీఎస్ వర్గాలు తెలిపాయి.