శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో భూతల స్వర్గం మరింత అందాలను పులుముకున్నది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలో ఆదివారం రాత్రి నుంచి నిరాటంకంగా మంచు పడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో హిమం గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. మంచుధాటికి జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కాగా, రాంబన్ జిల్లాలోని రాంపడి-బనిహల్ మధ్య 44వ నంబర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు బండరాళ్లను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ ఇష్యూ చేశారు.
#WATCH | J&K | A major slide has occurred near Rampadi, Banihal, on National Highway-44. People are advised to follow J&K Traffic Police advisory: Deputy Commissioner, Ramban
(Video: Deputy Commissioner, Ramban) pic.twitter.com/b2EYVf1dAd
— ANI (@ANI) February 1, 2023