Heavy Rains | ఇటీవల మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం నీట మునిగింది. ఈ వానల నుంచి ఇప్పటికీ జనం కోలుకోక ముందే.. మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పలుచోట్ల ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. తిరునెల్వేలీ నగరం, రూరల్ తిరునల్వేలి ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఆకస్మిక వరదలతో తిరునల్వేలీ అర్బన్, రూరల్ వీధుల్లోకి వరద చేరింది. తిరునెల్వేలి జిల్లాలోని పాపనాశం, మణిముత్తర్ డ్యామ్లలో నీటిమట్టం పెరిగింది. తామిరబరణి నది పరివాహక ప్రాంతంలో అతి భారీ వర్షం కురిసిన కారణంగా ఆకస్మిక వరద రావడంతో నీటిమట్టం వేగంగా పెరిగింది. దీంతో నీటిని దిగువకు విడుదల చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఆదివారం పశ్చిమ కనుమల్లోని మంజోలై కొండల్లోని ఊతులో 16.9 సెంటీమీటర్లు, కక్కాచిలో 15, మంజోలైలో 13.5 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.
ఇదిలా ఉండగా.. రాబోయే వారం రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతున్నది. మిగ్జాతం తుఫాను తమిళనాడు ఉక్కిరిబిక్కిరి చేసింది. తాగునీటికి సైతం జనం ఇబ్బందులుపడుతున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.
#WATCH | Kanniyakumari, Tamil Nadu: Streets in Nagercoil waterlogged following heavy rainfall in the region. pic.twitter.com/SjraUNKKve
— ANI (@ANI) December 17, 2023