Crop Loans : డిమాండ్ల సాధనకై రైతులు పోరుబాట పట్టిన క్రమంలో హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర బడ్జెట్ను సమర్పిస్తూ పంట రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి పంట రుణాలపై వడ్డీ, పెనాల్టీలను మాఫీ చేస్తున్నామని శాసనసభలో సీఎం ప్రకటించారు.
ఈ ఏడాది మే 31లోగా అసలు మొత్తాన్ని చెల్లించే రైతులకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఎంఎఫ్ఎంబీ (మేరీ ఫసల్ మేరీ బ్యోరా) వద్ద నమోదైన రైతులకు ఈ పధకం వర్తిస్తుందని తెలిపారు. పంట రుణాలపై వడ్డీ మాఫీని విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా ప్రస్తావిస్తూ రైతులు గురించి మాట్లాడుతున్న మీరు హరియాణ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులపై ఎందుకు నాసా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని నిలదీశారు.
దీనిపై సీఎం బదులిస్తూ తానూ రైతు బిడ్డనేనని, రైతుల బాధ తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. రైతుల కోసం పధకం ప్రకటిస్తే దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు.
Read More :
Hyderabad | పెండ్లికి నో చెప్పాడని యాంకర్ను కిడ్నాప్ చేసిన యువతి.. పది రోజులుగా రూంలోనే బంధించి..