Hyderabad |హైదరాబాద్లో ఓ యువతి రెచ్చిపోయింది. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ప్రొఫైల్ చూసి ఓ యువకుడిని చూసి ఇష్టపడిన అమ్మాయి.. తనను పెండ్లి చేసుకోవాలని వెంటపడింది. అతను నో చెప్పడంతో రౌడీలకు సుఫారీ ఇచ్చి మరీ కిడ్నాప్ చేయించింది. పది రోజులుగా తన రూమ్లోనే బంధించింది. కానీ యువతి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రణవ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూనే.. ప్రముఖ టీవీ ఛానల్లో ప్రణవ్ యాంకర్గా పార్ట్ టైమ్జాబ్ చేస్తున్నాడు. రెండేండ్ల క్రితం ప్రణవ్ ఫొటోను మ్యాట్రిమోనీ వెబ్సైట్లో చూసిన త్రిష అనే యువతి అతన్ని ఇష్టపడింది. తనను పెళ్లి చేసుకోవాలని అనుకుని సంప్రదించింది. కానీ ఎవరో ఆగంతకుడు ప్రణవ్ పేరుతో నకిలీ ఐడీని సృష్టించారని తెలుసుకున్న త్రిష.. అతన్ని అప్రమత్తం చేసింది. దీంతో తన పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారని ప్రణవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే పరిచయంతో తనను పెండ్లి చేసుకోవాలని త్రిష రెండేండ్లుగా ప్రణవ్ వెంటపడుతుంది.
తనను పెండ్లి చేసుకోవడానికి ప్రణవ్ నిరాకరించడంతో త్రిష అతనిపై నిఘా పెట్టింది. అతని కారులో లొకేషన్ ట్రాకర్ అమర్చింది. ప్రణవ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో గమనిస్తూ ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా ప్రణవ్ను పెండ్లాడాలని ఫిక్సయిన త్రిష.. ఈ నెల 11న రౌడీలకు సుఫారీ ఇచ్చి మరీ కిడ్నాప్ చేయించింది. అప్పట్నుంచి తన రూమ్లోనే బంధించింది. ఈ క్రమంలో త్రిష చెర నుంచి తప్పించుకున్న యాంకర్ ప్రణవ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, త్రిష హైటెక్ సిటీలో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోటీశ్వరురాలు అని.. 5 స్టార్టప్ కంపెనీలకు ఆమె ఎండీ అని కూడా తెలుస్తోంది.