ఇటీవలే కాంగ్రెస్కి గుడ్ బై చెప్పిన హార్థిక్ పటేల్ మళ్లీ కాంగ్రెస్పై మండిపడ్డారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ కించపరుస్తోందంటూ ఆరోపించారు. ఎప్పుడూ హిందువుల మనోభావాలను ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రామ మందిర నిర్మాణానికి వాడే ఇటుకు విషయలో గుజరాత్కు చెందిన సీనియర్ నేత ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే హార్థిక్ పటేల్ కాంగ్రెస్పై మండిపడ్డారు.
అసలు రాముడి విషయంలో కాంగ్రెస్కు ఉన్న శత్రుత్వం ఏమిటో చెప్పాలని హార్థిక్ పటేల్ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఇంతగా కాంగ్రెస్ హిందువులను ఎందుకు ద్వేషిస్తోంది? అంటూ ప్రశ్నించారు. చాలా కాలం తర్వాత అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం అవుతోందని, అయినా.. కాంగ్రెస్ రామాలయానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తోందని హార్థిక్ పటేల్ దుయ్యబట్టారు.