లుధియానా, మే 5: తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్టు విచారణ సంస్థలు నిరూపించినా తనను బహిరంగంగా ఉరి తీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
శుక్రవారం పంజాబ్లో 80 ఆమ్ ఆద్మీ క్లినిక్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తనపై దొంగ, అవినీతిపరుడని ఎలాగైనా ముద్ర వేయడానికే కేంద్రం సీబీఐ, ఈడీ, ఇన్కమ్ టాక్స్, పోలీసులను తనపైకి పంపిస్తున్నదని ఆయన ఆరోపించారు. సిసోడియా, సత్యేందర్ జైన్ బీజేపీ కుట్రల వల్లే జైలుకు వెళ్లారన్నారు.