Pran Pratistha | అయోధ్య రామాలయం (Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ఠ (Pran Pratistha)కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా వేలమంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు (government offices) ‘హాఫ్ హాలిడే’ (Half-day) ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆఫీసులన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
రామ్లల్లా ప్రాణప్రతిష్ట వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఈ హాఫ్ హాలిడే వర్తిస్తుందని వెల్లడించింది.
Due to the overwhelming sentiment of the employees and requests from them, Central Government announces half day closing till 2:30 pm on 22nd January 2024, at all Central Government offices, Central institutions and Central industrial establishments throughout India on the… pic.twitter.com/9xTPwSx3Ga
— ANI (@ANI) January 18, 2024
మరోవైపు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో 22వ తేదీన అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా సహా పలు రాష్ట్రాలు సైతం ప్రాణ ప్రతిష్ట రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. ఇక, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్లో మద్యం దుకాణాలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read..
Student | కోచింగ్ క్లాస్లో కుప్పకూలి ప్రాణాలు వదిలిన సివిల్ సర్వీసెస్ విద్యార్థి.. VIDEO
12th Fail | గొప్ప సినిమా అనేది కథ నుంచే వస్తుంది.. 12th ఫెయిల్పై ఆనంద్ మహీంద్రా రివ్యూ
Sachin Tendulkar | సచిన్ డీప్ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు