P Chidambaram | మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో వేడి కారణంగా అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి.. స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. చిదంబరం ఆశ్రమంలో ఒక కార్యక్రమానికి హాజరైన వేడి కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి. తన తండ్రి చిదరంబరం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఏం ఇబ్బంది లేదని కార్తీ చిదంబరం తెలిపారు.
#WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25
— ANI (@ANI) April 8, 2025