ట్రాన్స్ఫర్ల నుంచి కాంట్రాక్టుల దాకా ప్రతిదానికి డబ్బులివ్వాల్సిందే
అహ్మదాబాద్, మే 23: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. అవినీతి అంటేనే తమకు తెలియదని, లంచాలు లేని పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకొనే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సాక్షాత్తూ సీఎం భూపేంద్ర పటేల్ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) ధృమిల్ పటేల్ లంచావతారం ఎత్తాడు. పోలీసుల ట్రాన్స్ఫర్ల నుంచి నిర్మాణ కాంట్రాక్టుల అనుమతి దాకా అన్నింటికీ లంచమే. ధృమిల్ పటేల్ అవినీతి దాహం నిజమేనని ఇంటలిజెన్స్ బ్యూరో దర్యాప్తులో కూడా తేలింది.
‘ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించింది’ అని గుజరాత్ సీఎం కార్యాలయం పేర్కొన్నది. ధృమిల్ పటేల్ను పీఏ పోస్టు నుంచి తొలగించింది. భూపేంద్ర పటేల్ సీఎం అయినప్పటి నుంచి ధృమిల్ పటేల్ ఆయనకు పీఏగా ఉండటం గమనార్హం. ఇటీవల గుజరాత్ పోలీస్ ట్రాన్స్ఫర్లలో కూడా ధృమిల్ చేతివాటం చూపించినట్టు అనుమానిస్తున్నారు.