న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను గురువారం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న వివరాల మేరకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
గుజరాత్లో 182 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ 99, కాంగ్రెస్ 77, మిగతా చోట్ల స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం పూర్తి కానున్నది. ఇటీవల హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావించారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.