ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250 కుక్కలను ఓ కోతుల గుంపు నిర్దాక్షిణ్యంగా చంపేసింది. చదవడానికే వింతగా.. విచిత్రంగా ఉంది కదా. 250 కుక్కలను చంపడం అంటే మాటలు కాదు. అయినా కోతులకు, కుక్కలకు మధ్య ఎంత వైరం ఉన్నా.. చంపేంత ఉండదు కదా అని అంటారా? అసలు ఏం జరిగిందో.. ఆ కోతులకు అంత కోపం ఎందుకు వచ్చిందో? అన్ని కుక్కలను ఎందుకు చంపాయో తెలుసుకుందాం రండి.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, మాజల్గావ్లో చోటు చేసుకుంది. గత నెలలో ఓకోతి పిల్లను కొన్ని కుక్కలు కలిసి వెంటాడి.. వేటాడి చంపేశాయి. ఆ ఘటనను చూసి మిగితా కోతులు చలించిపోయాయి. దీంతో వాటిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాయి.
దీంతో అప్పటి నుంచి అక్కడ ఏకుక్క పిల్ల కనిపించినా.. వాటిని ఎత్తుకొచ్చి చెట్ల మీదికి ఎక్కి.. బిల్డింగ్ల మీదికి ఎక్కి అక్కడి నుంచి వాటిని వదిలేయడం ప్రారంభించాయి. అలా.. 250 కుక్కలను ఆ కోతులు మట్టుబెట్టాయి.
మాజల్గావ్ చుట్టుపక్కన కుక్కలు భారీ సంఖ్యలో చనిపోతుండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కోతులే కుక్కలను చంపుతాయని తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు కోతులను మాత్రం పట్టుకోలేకపోయారు.
గ్రామంలో ఉన్న కుక్కలన్నింటినీ కోతులు చంపేయడంతో అక్కడ ఒక్క కుక్క కూడా కనిపించడం లేదట. కుక్కలను చంపడం పూర్తయ్యాక.. తమ ప్రతీకారం తీరాక.. కోతులు ఊళ్లో ఉన్న చిన్నపిల్లల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయట. దీంతో గ్రామస్థులు కోతులు ఎక్కడ కనిపిస్తే అక్కడ తరమడం మొదలు పెట్టారు. దీంతో వాటి హడావుడి కాస్త తగ్గిందని గ్రామస్తులు అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rahul | గంగలో మునుగుతారు కానీ… నిరుద్యోగం ఊసెత్తరు: రాహుల్ ఎద్దేవా
కేంద్ర మంత్రుల పేరిట వ్యాక్సిన్ సర్టిఫికెట్లు.. విచారణకు ఆదేశం
MP Brijbhushan: యువ రెజ్లర్ను చెంపదెబ్బలు కొడుతూ కెమెరా కంటికి చిక్కిన ఎంపీ.. వీడియో