Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Pollution) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. మంగళవారం ఉదయం గాలి నాణ్యత సూచిక ప్రమాదకరస్థాయిలో నమోదైంది. ఏక్యూఐ లెవెల్స్ 425కుపైనే నమోదయ్యాయి. వాయు కాలుష్యం క్షీణించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో జీఆర్ఏపీ స్టేజ్-3 ఆంక్షలు విధించింది (GRAP Stage III Curbs Imposed ).
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సోమవారం ఉదయం 362గా ఉన్న ఏక్యూఐ లెవెల్స్.. మంగళవారం ఉదయానికి 425గా నమోదయ్యాయి. దీంతో రాజధానిలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేత పనులపై నిషేధం విధించింది. వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో సహాయపడటానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద మూడో దశ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో పెట్రోల్తో నడిచే బీఎస్-3, బీఎస్-4 డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు విద్యాసంస్థలకు కూడా ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. హైబ్రిడ్ పద్ధతిని అవలంభించాలని సూచించింది. ఐదవత తరగతి వరకూ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించింది.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Also Read..
PM Modi | కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదు.. ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ
Delhi Blast | ఢిల్లీ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు.. ఆ భయంతోనే..!