భోపాల్: ఒక వ్యక్తికి చెందిన తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు ఆ వృద్ధుడ్ని బైక్పై ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు లోపలకు తెచ్చాడు. (Man Rides Bike Up To Hospital’s Emergency Ward) అమీర్ ఖాన్ బ్లాక్బస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’ను ఇది గుర్తుకు తెచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని సత్నాలో ఈ సంఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి నీరజ్ గుప్తా అనే వ్యక్తి తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు మరో వ్యక్తి సహాయంతో తాతను బైక్పై కూర్చోబెట్టి సత్నాలోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి బైక్ను నడిపాడు. వెనుక కూర్చొన్న వ్యక్తి అక్కడి సిబ్బంది కలిసి అచేతనంగా ఉన్న ఆ వృద్ధుడ్ని బైక్ నుంచి కిందకు దించారు. అనంతరం అత్యవసర వైద్యం అందించారు.
కాగా, నీరజ్ గుప్తా తన బైక్ను వెనక్కి నడిపి ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు వచ్చాడు. ఇది చూసి అక్కడున్న వారు విస్తూపోయారు. అయితే బైక్ను ఆసుపత్రి బయట పార్క్ చేసిన నీరజ్, అనంతరం పరుగున ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లాడు. తన తాత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన డ్యూటీ డాక్టర్, బైక్ను నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి నడిపిన నీరజ్ను మందలించాడు. అక్కడున్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
He rode his motorbike right up to the Emergency ward of a hospital in Madhya Pradesh, his grandfather behind him was held up by another man, mirroring a scene from Aamir Khan blockbuster ‘3 Idiots’. pic.twitter.com/eGCKoqiiA7
— sarfaraz adil (@sarfarazadil21) February 11, 2024