(Satyapal Malik) ఝుంఝును : రైతుల ఉద్యమంపై గతంలో సానుకూల వ్యాఖ్యలు చేసిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. మరోసారి రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. రైతుల సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం నెరిపేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కొందరి మాటలు విని రైతు సమస్యను సాగదీస్తున్నదని, ఇలాంటి వారి వల్లే మోదీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తే ఆటోమేటిక్గా రైతు ఉద్యమం ముగుస్తుందని కొత్త రకం సలహా కూడా ఇచ్చారు. ఎంఎస్పీ ఇస్తామని హామీ ఇవ్వడానికి కేంద్రం చట్టం తీసుకురావాలని సూచించారు. రాజస్థాన్లోని ఝుంఝును ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ మీడియాతో సంభాషించారు. సత్యపాల్ మాలిక్ ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ నేత. బీజేపీ టిక్కెట్పై రెండుసార్లు ఎంపీగా ఉన్నారు.
‘రైతులు 10 నెలలుగా ఇండ్లు, కుటుంబాలను వదిలి వీధుల్లో కూర్చున్న తీరును కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. పంటలు వేయాల్సిన సమయమిది. వారి సమస్య వినకపోవడం వల్ల ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్ర ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు. కేంద్ర ప్రభుత్వానికి కొందరు తప్పుడు సలహాలు ఇస్తున్నారని, వారి కారణంగానే సత్యం మరుగున పడుతున్నదని విచారం వ్యక్తం చేశారు. మొదటి నుంచి రైతుల పక్షాన నిలబడ్డాను. రైతుల కోసం ప్రధాని, హోం మంత్రితో పోరాడాను. ఉద్యమంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఎవరైనా కోరితే, అందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని సత్యపాల్ మాలిక్ చెప్పారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రశ్నించగా.. ఘటన జరిగిన మరుసటి రోజునే అజయ్ మిశ్రా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని, ఆయన కేంద్ర మంత్రి పదవికి పనికిరారని వ్యాఖ్యానించారు.
బెనజీర్ భుట్టో కాన్వాయిపై ఆత్మాహుతి దాడి
ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్తో సంబంధముంటుందా?
ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..