(Data Stealing) ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల కాలంలో యూజర్ డాటా సేకరణ, దుర్వినియోగం అతి పెద్ద భయంగా తయారైంది. ఇప్పటికే పలు సంస్థల నుంచి వినియోగదారుల డాటా లీక్ అయినట్లు, బయటి వ్యక్తుల చేతుల్లోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయంలో స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉండగా.. ఇప్పుడు మరో కొత్త భయం తెరపైకి వచ్చింది. వినియోగదారుల డాటాను వారి అనుమతి లేకుండా సేకరించడం కోసం పలు టెక్ కంపెనీలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కాగా, ఫోన్లో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రీ-ఇన్స్టాల్ చేసిన యాప్లు వినియోగదారుల అనుమతి లేకుండా వారి డాటాను రహస్యంగా నిల్వ చేస్తున్నట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.
గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్రీ-ఇన్స్టాల్ యాప్లతో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ పరికరాలైన సామ్సంగ్, షియోమి, హ్యువావే, రియల్మీ, లైనేజ్ ఓఎస్, ఈ/ఓఎస్ 6 వేరియంట్లకు పంపిన డేటాను అధ్యయనకారులు పరిశీలించారు. ఈ అధ్యయనానికి ‘సామ్సంగ్, షియోమి, హువావే, రియాలిటీ హెడ్ సెట్ ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్ ఓఎస్ స్నూపింగ్’ అని పేరు పెట్టారు. దీని ప్రకారం, హ్యాండ్ సెట్ యాక్టివ్గా ఉన్నప్పుడు, ఈ/ఓఎస్ మినహా అన్ని వేరియంట్లు థర్డ్ పార్టీకి తగినంత మొత్తంలో డాటా బదిలీకి అనుమతిస్తాయి. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్కు చెందిన ప్రీ-ఇన్స్టాల్ యాప్లు కూడా ఉన్నాయి. ప్రీ-ఇన్స్టాల్ యాప్లను అన్ఇన్స్టాల్ చేయడం సాధ్యం కాదు. ఈ పరిశోధన డబ్లిన్లోని ట్రినిటీ కాలేజీలో నిర్వహించారు. వినియోగదారుల నుంచి దొంగిలించిన డాటాలో యాప్ స్క్రీన్, వెబ్ యాక్టివిటీ, ఫోన్ కాల్స్ కోసం గడిపిన సమయం, డివైజ్ ఐడెంటిఫైయర్లు, హార్డ్వేర్ సీరియల్ నంబర్లు కూడా ఉండటం భయపెడుతున్నాయి.
హైతీలో అమెరికా మిషనరీలు కిడ్నాప్
పేదరికం నిర్మూలన ఎప్పటికి సాధ్యమయ్యేను..?
పండ్ల వ్యర్థాల నుంచి కొత్త రకం బ్యాండేజీ.. సింగపూర్ శాస్త్రవేత్తల సృష్టి
అన్నపూర్ణలకే ఆహార సమస్యలు.. రక్తహీనత సమస్యలు తొలిగేదెలా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..