పోర్ట్-ఓ-ప్రిన్స్ : (Missionaries Kidnap) హైతీలో అమెరికాకు చెందిన 17 మంది మిషనరీలు కిడ్నాప్నకు గురయ్యారు. అమెరికన్ క్రిస్టియన్ మిషనరీలు, వారి కుటుంబాలను హైతీలో ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం. మిషనరీలు హైతీ రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్లోని అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. తమ బృందంలోని కొందరిని విమానాశ్రయంలో దింపేందుకు బస్సులో వెళ్తున్నట్లుగా తెలుస్తున్నది. కిడ్నాప్ అయిన వారిలో మిషనరీల పిల్లలు కూడా ఉన్నారు. ఆఫ్రికాలోని అత్యంత పేద దేశాల్లో హైతీ ఒకటి. ఇటీవలి కాలంలో ఇక్కడ గ్యాంగ్ వార్స్ మితిమీరి పోతున్నాయి. ఈ కారణంగా వేలాది మంది నిరాశ్రయులవుతుండగా.. దేశ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, హైతీలో మిషనరీల కిడ్నాప్ వ్యవహరాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్నిఫర్ వయావు తెలిపారు. ఇలాఉండగా, హైతీలోని అమెరికా రాయబార కార్యాలయం దీనిపై ఇంతవరకు స్పందించకపోవడం విచారకరం. కిడ్నాప్ జరిగిన తీరుపై సమాచారం సేకరిస్తున్నామని, అపహరణకు గురైన మిషనరీలను క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్చలు ప్రారంభించినట్లు హైతీ పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు.
కిడ్నాప్, దోపిడీలకు పాల్పడుతున్న ముష్కరుల ముఠా.. పోర్ట్-ఓ-ప్రిన్స్, డొమినికన్ రిపబ్లిక్ సరిహద్దులో గత కొంత కాలంగా చురుకుగా ఉన్నది. ఈ ముఠా అనేక దొంగతనాలు, కిడ్నాప్లకు పాల్పడింది. యుఎస్ ఆధారిత క్రైస్తవ సహాయ మంత్రిత్వ శాఖలు వివిధ మతపరమైన మిషన్లకు కిడ్నాప్ సందేశాన్ని అందించాయి. మిషనరీలు సురక్షితంగా తిరిగి రావడానికి ప్రార్థించాలని ప్రజలను ఆ సందేశంలో కోరాయి. అపహరణకు గురైన వ్యక్తులు హైతీలో అనాథాశ్రమం నిర్మిస్తున్నట్లు సమాచారం.
పేదరికం నిర్మూలన ఎప్పటికి సాధ్యమయ్యేను..?
పండ్ల వ్యర్థాల నుంచి కొత్త రకం బ్యాండేజీ.. సింగపూర్ శాస్త్రవేత్తల సృష్టి
అన్నపూర్ణలకే ఆహార సమస్యలు.. రక్తహీనత సమస్యలు తొలిగేదెలా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..