బెంగళూరు: వినాయకుడి నిమజ్జన యాత్రలో హిందూ మహాసభ నాయకులు గాడ్సే చిత్రపటాన్ని ఊరేగించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో జరిగింది.
హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిమజ్జనయాత్రలో భాగంగా గాడ్సే చిత్రపటాన్ని ఊరేగించారు. ఈ విషయంపై బెంగళూరు గాంధీ స్మారక ట్రస్టు సీరియస్ అయ్యింది. కారకులపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం బొమ్మైకి ట్రస్టు లేఖ రాసింది.