బెంగళూరు: ఖరీదైన తన కారును బైకర్ ఢీకొట్టడంపై మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సు కింద పడి చచ్చిపో (Go Die Under A Bus) అంటూ అతడిపై రంకెలు వేసింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ, శుక్రవారం సొంతూరైన సాలిగ్రామంలో రూ.1.5 కోట్ల ఖరీదైన టయోటా వెల్ఫైర్ కారులో ప్రయాణించింది. ఈ సందర్భంగా రాంగ్ రూట్లో వచ్చిన బైకర్ ఆ కారును ఢీకొట్టాడు. దీంతో బైక్ నడిపిన వ్యక్తిపై ఆమె మండిపడింది. ‘చావాలనుకుంటే బస్సు కింద పడి చచ్చిపో. రాంగ్ సైడ్లో ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు?’ అని దూషించింది. తన కారుకు జరిగిన నష్టానికిగాను రూ.50 లక్షలు చెల్లిస్తావా అని అడిగింది. అలాగే జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన స్థానికులపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అయితే ఈ వీడియోపై భవాని రేవణ్ణ, ఆమె కుటుంబ సభ్యులు లేదా జేడీ(ఎస్) పార్టీ స్పందించలేదు. కాగా, భవాని భర్త హెచ్డీ రేవణ్ణ ఎమ్మెల్యే కాగా, ఆమె కుమారులు ప్రజ్వల్ ఎంపీ, మరో కుమారుడు సూరజ్ రేవణ్ణ ఎమ్మెల్సీగా ఉన్నారు.
A video shows former prime minister #HDDeveGowda’s daughter-in-law & #JDS leader #BhavaniRevanna yelling at villagers after a two-wheeler allegedly damaged her pricey Toyota Vellfire.#Karnataka #Mysuru #RoadAccident #HDRevanna pic.twitter.com/I4GRvgoGVQ
— Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2023