న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన విరాళాల వివరాల్ని ఈ నెల 15లోపు తమకు సమర్పించాలని ఆయా రాజకీయ పార్టీలను ఈసీ కోరింది.
ఎన్నికల బాండ్ల విరాళాలపై తాజా సమాచారంతో తమ ముందుకు రావాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా వివరాల్ని కోరుతూ ఆయా రాజకీయ పార్టీలకు ఈసీ లేఖలు రాసింది.