పాట్నా: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్నారు. (mid-air meeting) విమానం పాట్నాలో ల్యాండ్ అయిన తర్వాత లాలూ తాను మాట్లాడుకున్నట్లు గిరిరాజ్ సింగ్ తెలిపారు. కుమారుడు తేజస్వి యాదవ్ పైనే బీహార్ భవిష్యత్తు ఆధారపడి ఉందని లాలూ తనతో అన్నట్లు చెప్పారు. అలాగే ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ బ్లాక్లో విభేదాలున్నట్లు ఆయన ద్వారా తెలిసిందన్నారు.
కాగా, అదే విమానంలో లాలూతో కలిసి ప్రయాణించిన ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దీనిని ఖండించారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు అర్థ రహితమని అన్నారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆయన అడిగారని, అలాగే విందు ఇచ్చేందుకు ఆసక్తి చూపారని తేజస్వి యాదవ్ తెలిపారు. తన గురించి తప్ప మిగతా అంశాలు వారిద్దరూ మాట్లాడుకున్నారని చెప్పారు. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధిష్టానం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు గురించి గిరిరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తేజస్వి యాదవ్ ట్విస్ట్ ఇచ్చారు.