Gali Janardhan Reddy | బెంగళూరు, నవంబర్ 21: ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలుకెళ్లిన కర్ణాటక బీజేపీ మాజీ నేత గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమలం పార్టీలో చేరాలని యోచిస్తున్నారు. ఆయన సన్నిహితులు మాట్లాడుతూ ఆరు నెలల కిందట జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడాన్ని, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనుండటాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్ఠానం కూడా గాలి జనార్దన్ రెడ్డి చేరికకు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు.
మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడిని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంపై పలు విమర్శలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో జనార్దన్రెడ్డిని చేర్చుకుంటే కొంత కలిసొస్తుందని బీజేపీ భావిస్తున్నట్టు వెల్లడించారు.