ఇంఫాల్, అక్టోబర్ 5: మణిపూర్లో చెలరేగిన హింస నెలలు గడిచినా సద్దుమణగడం లేదు. తాజాగా రాజధాని ఇంఫాల్లో మరోసారి హింస చెలరేగింది. ఈ హింసలో రెండు ఇండ్లు కాలిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఓ చోట గుంపుగా గుమికూడిన మహిళలను చెదరగొట్టారు.
బుధవారం రాత్రి 10 గంటల సమయంలో హింస చోటుచేసుకున్నదని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని పోలీసులు చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నామని వెల్లడించారు. కాగా, మణిపూర్లో మే 3 నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో 180 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.