Accident | న్యూఢిల్లీ, మార్చి 14: రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తున్నది. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు. ‘చండీగఢ్లో పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభించాం. రోడ్డు ప్రమాద బాధితులకు సరైన సమయంలో వైద్య చికిత్స అందించాలన్నది ముఖ్య ఉద్దేశం.
ప్రమాదం జరిగిన రోజు నుంచి గరిష్టంగా 7 రోజులపాటు, రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందుతుంది’ అని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. పైలట్ ప్రోగ్రామ్లో వచ్చే ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా పథకాన్ని అమలుజేస్తామని వెల్లడించింది.