న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నలుగురు తెలుగువారు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా, మండపేటకు చెందినవారు. వీరు డిసెంబరు 3న వారణాసిలోని ఓ ఆశ్రమానికి వెళ్లారు.
గురువారం ఉదయం వీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవలసి ఉంది. కానీ వీరు తమ గది నుంచి బయటకు రాకపోవడంతో, ఆశ్రమ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమక్షంలో గది తలుపులను తెరచి చూడగా వీరంతా మరణించి కనిపించారు. వీరివద్ద కనిపించిన సూసైడ్ నోట్ ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్లో పని చేస్తున్న భర్తకు తన కార్యాలయంలో పని చేస్తున్న మరొకరితో ఆర్థికపరమైన వివాదం ఉంది. ఈ సూసైడ్ నోట్ను తెలుగులో రాశారు.