Deve Gowda | దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 9-10 తేదీల్లో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Meeting) జరగనున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని భారత మండపంలో జరగనున్న ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకాబోతున్నారు. కాగా, జీ20 సమావేశాల (G20 Meeting) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) శనివారం రాత్రి ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ విందుకు మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు సహా పలు పార్టీల నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవగౌడలకు కూడా ఆహ్వానం అందింది.
అయితే, ఈ విందుకు దేవగౌడ (Deve Gowda) దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘జీ20 సమ్మిట్ సందర్భంగా 9వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముజి ఏర్పాటు చేసిన విందుకు నేను హాజరుకావడం లేదు. ఆరోగ్య కారణాల వల్ల ఈ విందుకు రావడం లేదని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశాను. జీ20 సదస్సు గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా, ఈ విందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం వెళ్లింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు కూడా ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్తో పాటు ఇండియా కూటమిలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లకు ఆహ్వానం అందించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు మాత్రం ఆహ్వానం అందలేదని ఆఫీసు వర్గాలు వెల్లడించాయి.
I will not be attending the G20 dinner organised by the Hon. President of India Draupadi Murmuji, on 09 September 2023, due to health reasons. I have already communicated this to the government. I wish the G20 summit a grand success. @PMOIndia @rashtrapatibhvn
— H D Deve Gowda (@H_D_Devegowda) September 8, 2023
Also Read..
G20 Meeting: మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవగౌడకు ఆహ్వానం.. మల్లిఖార్జున్ ఖర్గేకు అందని ఆహ్వానం
Actor Sathyaraj | సనాతన ధర్మంపై ఉదయనిధి స్పష్టంగా మాట్లాడారు.. మంత్రికి మద్దతు తెలిపిన కట్టప్ప
Python | ఇంట్లోకి దూరిన కొండచిలువను ఈజీగా పట్టేసిన క్రికెటర్.. వీడియో