న్యూఢిల్లీ: జీ20 సమావేశాల(G20 Meeting) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిన్నర్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ విందు కోసం ఇప్పటికే ఆహ్వాన పత్రికలు వెళ్లాయి. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవగౌడలకు ఆహ్వానం అందించింది. ఢిల్లీలోని భారత మండపంలో 18వ జీ20 సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం వెళ్లింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు కూడా ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది.
బీహార్ సీఎం నితీశ్ కుమార్తో పాటు ఇండియా కూటమిలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లకు ఆహ్వానం అందించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు మాత్రం ఆహ్వానం అందలేదని ఆఫీసు వర్గాలు వెల్లడించాయి.