న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించింది. పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలతో సంబంధం ఉన్న మనీలాండరిగ్ కేసులో నవాబ్ మాలిక్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ను కోర్టు కొట్టేసింది.
మాలిక్ బెయిల్ పిటిషన్పై స్పెషల్ కోర్టు సుదీర్ఘ విచారణ పూర్తిచేసి గత నవంబర్ 14న తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఇవాళ బెయిల్కు నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. త్వరలో పూర్తి వివరాలతో కూడిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మనీలాండరింగ్ కేసులో విచారణ జరుపుతున్న ఈడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్ను అరెస్ట్ చేసింది.